![]() |
అంతకు ముందు ఇలా ఠీవిగా వుండేది |
దీన్ని నిర్మించారు. నిర్మాణ కాలం 72 సంవత్సరాలు పట్టిందట. ఒక మీటరు ఎత్తుగా ముందు పటిష్టమైన ప్లాట్ ఫాం నిర్మించి దానిపై వెయ్యి అద్భుతమైన నైపుణ్యంతో చెక్కిన స్థంబాలను నిలబెట్టారు. ఆ నిలబెట్టటంలో గణిత నైపుణ్యం విక్షకుడు ఏ స్థానం నుంచి చూసినా దేవతా మూర్తికి ఇవి అడ్డుపడకుండా వుండేలా జాగ్రత్త పడ్డారట. సిమెంటు వాడకుండా నిలబెట్టటం కంటే ఇది మరీ ఆశ్చర్యం అనిపించింది. త్రికూటాలయం లో నక్షత్ర పీఠం పై రుద్రేశ్వరుడిని ప్రతిష్టించారు. త్రీకూటాలయంలో ప్రధాన దేవతా మూర్తులుగా శివుడు, విష్ణువు, సూర్యభగవాడు.
![]() |
లావా జనిత ఎకశిలా నిర్మిత నిండైన నంది |
ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా వుంటుంది. వేయిస్థంభాల గుడి దక్షిణాభిముఖమై వుంటుంది. ఇలా నిర్మించటంలో ప్రధానోద్దేశం ఉదయ సూర్యకిరణాలు సరాసరి శివుని తాకటం కోసమే అయ్యింటుందని చెపుతారు.(మళ్ళీ దీనిపై వాస్తు దోషమంటూ కొత్త ఆర్భాటం కొంత మొదలయ్యింది ఇప్పుడు) ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై వున్న నందీశ్వరుడు నల్లటి బసాల్ట్ ( లావా శిల) నుంచి మలచ బడిన ఏక శిలా విగ్రహం. అత్యద్భుతమైన పాలిషింగ్ తో నున్నగా వుంటుందీ విగ్రహం. నంది పై చెక్కన గంటలు లాంటివి చాలా స్పష్టంగా చెక్కారు. తుగ్లక్ కాలం లో తీవ్రమైన విధ్వంసానికి గురయ్యింది. మతపరమైన ద్వేషంతోనే కాకుండా విగ్రహాల వెనుక నిధిరహస్యాలుంటాయని వాటిని ఛేదించాలని కూడా శిల్పలను ధ్వంసం చేశారు. అందులో నంది కూడా దెబ్బతింది. ఈ గుడుల మద్యలో నాట్య మంటపం వుంటుంది. ఆలయ ప్రాంగణంలో మరేడు
, రావి, వేపవృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు వున్నాయి. కేవలం ఆధ్యాత్మిక అవసరాలకోసం మాత్రమే కాకుండా భద్రతను కూడా సైనిక అవసరాలనూ దృష్టిలో వుంచుకుని ఇక్కడి నుండి ప్రధాన సైనిక స్థావరాల వరకూ భూ అంతర్భాగంలో సొరంగాలున్నయట. ఒక సొరంగ మార్గం ఓరుగల్లు కోట వరకూ వుండేదట. కొన్ని శిధిల గృహాలను ఇప్పటికీ తలుపులు మూసే వుంచుతున్నారు బహుశా వాటిలోపలేవైన ద్వంసమైన సొరంగ మార్గాలుండి వుండవచ్చు కూడా.
(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));