ఉద్యోగాల వేటలో ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఏ సైట్లలో సమాచారం దొరుకుతుంది? అనే విషయంలో గూగుల్ ని ఆశ్రయించినా అదిచూపించే సముద్రంలో ముత్యాల వేట అంత సులభంకాదు. కొన్ని ముఖ్కమైన జాబ్ సైట్లు ఇవి అవసరమైనా మిత్రుల కోసం
ఫేస్ బుక్ లో ఫోట్ ఆల్బంను మిత్రులు కూడా వాదిదగ్గర వున్న ఫోటోలు అప్లోడ్ చేసేలా పంచుకోవచ్చు. అంటే అదే సమావేశంలో లేదా సందర్భంలో దిగిన ఫోటోలను వేరువేరు మిత్రులు తీసినట్లయితే అవన్నీ ఒకే దగ్గర ఒకే అల్పంగా సేకరించుకుని కలిసి పంచుకునే అదనపు అవకాశం అన్నమాట.
ఆంధ్రప్రదేశ్ లో లభించే ఉపయోగకరమైన ఆకుకూరలు Tender leaves can be cooked, It is diuretic and sedative,It is useful in urinary tract problems.Xanthium strumarium (Rough Cocklebur, Clotbur, Common Cocklebur, Large Cocklebur, Woolgarie Bur) is a species of annual plants belonging to the Asteraceaefamily. It probably originates in North America and has been extensively naturalized elsewhere.
Reproductive biology
The species is monoecious, with the flowers borne in separate unisexual heads: staminate (male) heads situated above the pistillate (female) heads in the inflorescence. The pistillate heads consist of two pistillate flowers surrounded by a spiny [involucre]. Upon fruiting, these two flowers ripen into two brown to black achenes and they are completely enveloped by the involucre, which becomes a [bur]. The bur, being buoyant, easily disperses in the water for plants growing along waterways. However, the bur, with its hooked projections, is obviously adapted to dispersal via mammals by becoming entangled in their hair. Once dispersed and deposited on the ground, typically one of the seeds germinates and the plants grows out of the bur.
మరుల మాతంగి కాయలు
Toxic or medicinal phytochemistry
The plant may have some medicinal properties and has been used in traditional medicine in South Asia and traditional Chinese medicine. In Telugu, this plant is called by name Marula Matangi.
However, while small quantities of parts of the mature plants may be consumed, the seeds and seedlings should not be eaten in large quantities because they contain significant concentrations of an extremely toxic chemical, carboxyatratyloside. The mature plant also contains at least four other toxins. Animals have also been known to die after eating the plants. A patient consuming a traditional Chinese medicine containing cocklebur, called Cang Er Zi Wan (苍耳子丸) developed muscle spasms. It was responsible for at least 19 deaths and 76 illnesses in Sylhet District, Bangladesh, 2007. People ate large amounts of the plants, locally called ghagra shak, because they were starving during a monsoon flood and no other plants were available. The symptoms included vomiting and altered mental states, followed by unconsciousness.
ఈ మధ్య తీయని భాదల నేపద్యంలోనో, కొవ్వుని కరిగించే కార్యక్రమంలోనో రోటీకి బాగానే డిమాండ్ పెరిగింది. తినడానికేం భేషుగ్గా వుంటుంది. అసలు రోటీలో నంజుకునేందుకు కూరలు చెయ్యాలా? కూరలు తినేందుకు నంజుగా రోటీ వండుకుంటామా ? అనే భేతాళ ప్రశ్నకు సమాధానం వెతికే విక్రమార్కుడే దొరకలేదట.
ఆట పింటని పిలుచుకునే గోధుమపిండి, లేదా మరికొన్ని పిండ్లతో కలిసిన పిండిని నీళ్ళనుకావలసినంతే కలిపి చేతివేళ్ళకు కావలసినంత ఎక్సర్ సైజ్ చేయించి, దెబ్బలూ, మొట్టికాయలూ, పిడిగుద్దులూ, కసితీరా వేసేది. అప్పుడిక అప్పడాల కర్ర అందుకుంటే నా సామిరంగా సాఫయి పోవాల్సిందే కదా. ఇక వీటికోసం ఎన్ని రకాల పీఠలూ, ఎన్నెన్ని రకాల కర్రలు. క్రిందనో పైననో అంటుకోకుండా నొక్కగానే సరిపోదు దానికి అందమైన ఆకారం రావాల్సిందే. పైగా రౌండు గుండ్రమయితేనే ప్లేటుకి సరిపోనూ సరిగ్గా అమర్చేందుకు బావుంటుంది.
ఇక పెనం బాధలుచెప్పేదేముంది. ఆయిల్ తక్కువ వేయాలి. మాడిపోకూడదు. రోటీలూ, పుల్కాలూ, చపాతీలూ, చుక్కారోటీలూ, నాన్ లు, బటర్ నాన్ లు, పరాటా, పూరీ, ఆలూ స్పెషల్ పూరీ భారతీయ బ్రెడ్డుకు కావలసినన్ని రూపాలు.
ఇక జోన్ పిండి రొట్టెలైతే పీటలూ, కర్రలూ ఏంలేకుండా చేతులతోనే సమానంగా నైపుణ్యంతో వత్తేస్తారు. రుమాల్ రోటీ తినటం కంటే అది చేసేప్పుడు చూడటమే వింతగా వుంటుంది. సర్వపిండి రొట్టెలు పప్పుబద్దలతో హట్ హాట్ గా తెలంగాణాకి ఫేవరెట్,
సరే కానీ ఇంతకీ విషయం ఏంటంటే వీటిని పెద్దమొత్తంలో చేయడానికీ, సులభంగా చేసుకోవడానికీ చాలా రకాల యాంత్రిక పద్దతులొచ్చాయి. సరదాగా కొన్ని చూస్తారా మరి.
పిండి, నీళ్లూ వగైరా వేసేసి ఎన్ని రోటీలు కావలి? ఎంతమందంతో కావాలి లాంటి వివరాలు ఫీడ్ చేసి మనం డైనింగ్ టేబుల్ అమర్చుకునే లోగా నిమిషానికొకటి చొప్పున జిరాక్స్ మెషిన్లోంచి పేపర్లు పడ్డట్లు ప్లేటులోకి వచ్చేస్తున్నాయి.
న్యూస్ పేపరు అచ్చుకోసం వెళ్ళినట్లు దుప్పటి లాగా, ద్రౌపతికి కృష్ణుడు ప్రసాదిస్తున్న కోకలాగా ఓ క్రమంలో వస్తున్న రోటీ బెల్టుని చక్కని గుండ్రని ఆకారంలో కత్తిరించటం, అదే వరుసలో వాటిని వేడిచేయటం బెల్టు చివరికెళ్ళేసరికి తయారైన రోటీలను కుప్పలుగా వచ్చేస్తుంటే ప్యాక్ చేసుకోవడం… బహుశా కటింగ్ లో మిగిలిన పిండి ముక్కల్ని మళ్లీ రౌండ్ లో కలుపుతారేమో.
కొద్దిగా మనుషుల అవసరం ఎక్కువ కావలసిన రొట్టలు తయారు చేసే మినీ పరికరం. పిండి వృధాకావడం లేదు. యాంత్రిక శక్తికూడా మరీ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు.
సరే మీరు ఓపిగ్గా రోటీ మేకింగ్ మెషిన్ల కోసం వాటి వివరాల కోసం వెతుక్కుంటే చాలా దొరుకుతాయి. చివరిగా ప్రపంచంలోనే పెద్ద రోటీ ఎలా తయారు చేసారో చూడండి. మనం రుమాల్ రోటీ అన్నట్లే దీనికి కూడా పేరుపెట్టాలంటే లుంగీ రోటీనో, పంచె రోటీ అనో పెట్టాలేమో.. చూడండి చేతులతోనే సాగదీసి ఎంతబాగా ఆరేస్తున్నాడో
రెక్కలు ఆరుపాదాల ప్రక్రియ. దీనికి ఎలాంటి నియమం లేదు గాని మొదటి నాలుగు పాదాల తర్వాత ఒక ఎడం, దాని తర్వాత రెండు పాదాలువస్తాయి. అంటే పంక్తులను రెండు భాగాలుగా విడగొట్టడం జరిగింది.
దు:ఖాన్ని ఉపశమింపజేసే తాత్వికమైన ఓదార్పు
రెక్కలు కవిత ఆరు పాదాల్లో ఉంటుంది. మొదట నాలుగు పాదాలు రాసి, చిన్న గ్యాప్ ఇచ్చి మిగతా రెండుపాదాల్ని రాస్తుంటారు. ఈ ఎడం పాఠకుని ఊహకు పదునుపెట్టేదిగా వుంటుంది. రెక్కలు కవిత రెండు భాగాలుగా ఉంటుందన్నమాట! పై నాలుగు పాదాలు పక్షి శరీరంగాను, మిగతా రెండూ పక్షి రెక్కలుగాను భావిస్తూ దీనికి ‘రెక్కలు’ అనే పేరుపెట్టారనుకోవచ్చు. ఈ రెండు పంక్తులు రెక్కలై ఎగరనిదే సందేశం పూర్తికాదు. వీటి గురించి ప్రముఖ విమర్శకుడు డా అద్దేపల్లి రామమోహనరావు వ్యాఖ్యానిస్తూ‘పైనాలుగు పాదాలు ఒక జీవితానుభవాన్ని గూర్చి చెబితే, చివరి రెండు పాదాలు ఆ అనుభవం ద్వారా కవి చెప్పదలచిన తత్త్వం గూర్చి చెపె్తై. జీవితానుభవం నుంచి ఉపరితలానికి వెళ్ళి ఆలోచిస్తేనే తత్త్వం విశదమౌతుంది. రెక్కలతో, ఆకాశంపైకి ఎగిరితేనే చలనం ఉన్నతమౌతుంది’ అన్నారు. ‘‘స్పష్టమైన లక్ష్యం, లక్షణం రెక్కల్ని ప్రతిభావంతం చేశాయి. రెక్కలు అంటే పైకి ఎగరడానికి ఉపకరించేవి అని అర్థం.’’అని పేర్కొన్నారు.
“రెక్కలు’ను నూతన కవితా ప్రక్రియగా చేసి అందించిన వారు ఆనాటి పైగంబరకవి యం.కె.సుగమ్బాబు. కేవలం తెలుగులోనే కాకుండా ఆంగ్లంలోకీ ఈ కవితలు అనువాదం పొందాయి. సుగమ్ బాబు రాసిన కొన్ని ఎంపికచేసిన రెక్కలు కవితల్ని డేవిడ్ షూల్ మ్యాన్, ఆవులమంద మోహన్ ఆంగ్లంలోకి అనువదించగా, డా నోముల సత్యనారాయణ సంపాదకత్వంలో అది 2008లో ప్రచురితమైంది. తర్వాత కాలంలో శ్రీనివాస గౌడ్ ‘వెలుతురు వెలయాలు’, పద్మకళ ‘దృష్టి’, పెద్దూరి వెంకటదాసు, ధూర్జటి, షరీష్భాయ్ ముగ్గురూ కలిపి ‘త్రివేణి రెక్కల శతకం’ (2011), మల్లవరపు చిన్నయ్య ‘ఆమని’- ఇంకా చాలా మంది రెక్కలు కవితా సంపుటాల్ని ప్రచురిస్తున్నారు. రెక్కలు కవిత్వాన్ని పత్రికలు కూడా విరివిగానే ఆదరిస్తున్నాయి.
పి.శ్రీనివాసగౌడ్, రంగనాథ్, కేతవరపు రాజ్యశ్రీ, ద్యావరి నరేంద్రరెడ్డి ఇత్యాది కవులు “రెక్కలు’ప్రక్రియలో రచనలు చేస్తున్నారు.దాదాపు ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యి సుమారు దశాబ్దకాలంలోనే 60 కి పైగా రెక్కల సంపుటాలొచ్చాయట.
‘సీస’ కవిత్వ ప్రక్రియకు, ‘రెక్కలు’కు గల పోలిక
ప్రాచీన చందోబద్ద రచనల్లో సీసపద్యానిది పత్యేకమైన స్థానం దానిలో సీసం తర్వాత ముగింపులో ఆటవెలది కానీ, తేటగీతి గానీ చెప్పాలి. అదే పద్దతిలో రెక్కలు ప్రక్రియలో చివరి భాగం వుంటోందని విశ్లేషకులు పేర్కొన్నారు. నాలుగు భాగాలుగా ఉన్నా, ఇది హైకూ, నానీల మాదిరిగా కాకుండా సిలబల్స్ లేదా అక్షర నియతికంటే పాదాలు, పదాల నియమానికి కట్టుబడినట్లుంది. ఒకటి నుండి మూడు పదాల వరకూ ఒక్కో పాదంలో పాటిస్తున్నారు. ఎక్కవమంది చివరి రెండు పాదాల్లో చివరి పాదాన్ని ఒకే పదంతో ముగించడం కనిపిస్తుంది. అలాగే మరో నియమం- ఎక్కువ మంది ఆరు పాదాల్నీ ఒకటి రెండు పదాలతోనే కవిత్వీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల సంక్షిప్తతతో పాటు, కవితకి సూటిదనం వస్తుంది.
సుగమ్బాబు గారి అంతర్యానం రెక్కల సంపుటిలోని తొలి రెక్కను పరిశీలించి దాని లక్ష్య, లక్షణాలను తెలుసుకుందాం-
ఆదికవి ఆక్రందనే తొలిశ్లోకం అలా ఉపశమించింది ఆక్రోశం-
దు:ఖ పరిహారం కవిత్వం!
సాహిత్య ప్రపంచంలో అత్యంత సుపరిచితమైనది ఆదికవి వాల్మీకి శ్లోకం.
అంటే ఈ రెక్కలో వాల్మీకి అధిక్షేప శ్లోకం ద్వారా జరిగిన అన్యాయం ఉపశమించింది అన్నభావం వ్యక్తమైంది. దు:ఖ నివారణ మార్గం కవిత్వం అనేది ఒక తత్వంగా చెప్పబడింది.
కొన్ని విమర్శలు, సమాధానాలు
వచనానికి నిభందనలని జోడించి ప్రక్రియగా పేర్కొనడం వల్ల అదనపుప్రయోజనం ఏమి వుంటుందని, ఆధునిక ఛందోబందనాలను కవిత్వానికి తొడగటం కంటే మినికవితలను అలాగే వుండనివ్వొచ్చుకదా అనే కొందరు సాహితీవిమర్శకుల వాదన వున్నప్పటికీ ఒకపద్దతి ఎంచుకుని రాయడం వల్ల తొలినడకలకు చేదోడుగా వుంటుందనేది వివిధ నూతన ప్రక్రియలను అభిమానిస్తున్నవారి సమాధానం.. ప్రక్రియ ఏదైనప్పటికీ కవిత్వాన్ని వదలకుంటే పాఠకుల మనసులని తప్పకుండా రంజింపజేస్తుంది.
‘‘నాగేటి సాలల్లో నాతెలంగాణా ’’ పాటను అప్పటికే అనేక సభల్లో అనేక మంది గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, వైభవాన్ని తెలిపే ఆ పాట… చివరకు ఆర్.నారాయణమూర్తి నటించిన ‘వీర తెలంగాణ’ చిత్రంతో వెండితెరకు కూడా ఎక్కింది. గేయరచయిత నందిని సిద్దారెడ్డికి ఉత్తమ గేయరచయితగా 2010 సంవత్సరానికి నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఆ పాటే ‘నాగేటి సాలల్లో నా తెలంగాణ…’.తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించే సిధారెడ్డగారు కెసిఆర్, కోదండరామ్ వంటి ముందుశ్రేణి నాయకత్వానకి దగ్గరగా వున్న వ్యక్తి.
పుస్తకాలు చదవడం కాదు….పుస్తకాలు రాసుడు గొప్ప అన్న తండ్రి మాటలను ఆదర్శంగా తీసుకొని బడిలో తెలుగు పాఠాలు చెప్పే అష్టకాల నర్సింహ్మశర్మ గురువు ప్రోత్సాహంతో అన్నింటా గురువైన శివారెడ్డి ఆదరణతో తెలంగాణ బతుకు చిత్రాలను తన కలం నుండి మన కంటికి చూపిన బంగారమసొంటి కవి నందిని సిధారెడ్డి. 1955 జూలై 12న మెదక్ జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో బాలసిధారెడ్డి, రత్నమాల కు ముద్దుబిడ్డ నందిని సిధాడ్డి. బందారం గ్రామంలో బాల్యాని గడిపి ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని ఉన్నత పాఠశాల విద్యను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్కటూర్లో పూర్తి చేశారు. పేదరికం విద్యకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాలు తిప్పక కలం పట్టిన కవి సిధారెడ్డి. ఒక్క పూట తిండితోనే గడిపిన రోజులు ఎన్నో ఉన్నా మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువులను పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటూ పోస్టు గాడ్యుయేషన్ , 1981 లో ‘‘ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు ’’ అనే అంశంతో ఎంఫిల్ను పూర్తి చేశారు. 1986లో డాక్టర్ సి.నారాయణడ్డి పర్యవేక్షణలో ‘‘ ఆధునిక తెలుగు కవిత్వంలో వాస్తవికత, అధివాస్తవికత ’’ అనే అంశంతో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ను అందుకున్నారు.
సాహితీ ప్రయాణం
1973 నుండి మిత్రుడు భగవంతాడ్డి ప్రోత్సాహంతో సామాజిక కవిత్వం రాయడం మొదలు పెట్టారు. 1974 లో సిధారెడ్డి రాసిన దివిటి మినీ కవితా సంకలనాన్ని కందుకూరు శ్రీరాములు, కర్ణాల బాలరాజు కలిసి తొలి పుస్తకంగా అచ్చు వేయించారు. 1991లో సంభాషణ, 1995లో ప్రాణహిత, 1997లో భూమిస్వప్నం, 2001లో ఒక భాద కాదు, 2007లో నది పుట్టుబడి, 2007లో ఇగురం 2008 తెలుగు కుల వృత్తుల సాహిత్యం 2011 తెలంగాణా సాహిత్యంపై వ్యాసాలు 2012 నాగేటి సాలల్లో నా తెలంగాణా – నంది బహుమతి పొందిన పాట
గుర్తింపు
1987 భూమి స్వప్నం కవితా రచనకుగాను ఫ్రీవర్స్ ఫ్రంట్ 1988 లో దాశరథి అవార్డు పొందారు.
2001లో ప్రాణహిత కవితా సంకలనానికిగాను తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది. కానీ అప్పుడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.
2009లో విశ్వకళాపీఠం వారు ఒక భాద కాదు కవిత రచనకుగాను ఉత్తమ కావ్య స్నేహనిధి పురస్కారాన్ని అందించింది
1979లో మల్లీశ్వరీ గారిని జీవితభాగస్వామిగా ఆయన జీవితంలోకి ఆహ్వానించారు. వీరి గారాల పట్టి కుమారి వీక్షణ.
1994లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పని చేసిన సిధారెడ్డి ఉద్యమాలతో నిరంతర సంబంధాలు వామపక్ష విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్రను పోషించారు.
1994నాటి విప్లవ ఉద్యమం మొదలుకొని నేటి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన పాటలు, మాటలు తుపాకీ తూటాలైనవి.
1997 ఆగస్టు నెలలో ఆయన రాసిన తొలి పాట నాగేటి సాలల్లో నా తెలంగాణ అనే పాట తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి ఉర్రుతలూగించింది. అమరుల స్మృతి కోసం రాసిన జోహారులు…జోహారులు అనే పాట కడుపులో ఉన్న దుఃఖాన్ని కళ్లకు తెచ్చింది. ఆయన కవిత్వం రాసేటప్పుడు మనిషి ఎడ ఉన్నా మనస్సు మాత్రం బందారం చెరువు కట్టకాడ, మూడు గుండ్ల కాడ, బందారం ఊర్లే సంచారం చేస్తదట. ఊరి జ్ఞాపకాలన్నీ మదిలో మెదిలితేనే ఆయన కలం కదులుతదట. అందుకేనేమో ఆయన కవిత్వంలో పల్లె కన్న తల్లోలే కనబడుతది.
కీలక బాధ్యతలు
1984లో మెదక్ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేశారు. 1986లో మంజీర రచయితల సంఘాన్ని (MARASAM)- ఏర్పాటు చేసి తెలంగాణ కవులకు కొత్త వేదికను అందించారు. 2001అక్టోబర్ లో తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరించారు.
మంజీర అనే ద్వైమాసిక, సోయి అనే త్రైమాసిక పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిధాడ్డి కాలినడకను ఎక్కువగా ఇష్టపడతారు. చిందు భాగవతం, శారదకాళ్లు వంటి తెలంగాణ సంసృ్కతిని అద్దం పటే కళా ప్రదర్శనలు ఎక్కడ జరిగినా ముందు వరుస ప్రేక్షకుడు సిధారెడ్డి. ఫలితం వచ్చే దాకా పట్టువిడవకుండా పోరాడే తత్వాన్ని పెంచుకోవాలని సిధాడ్డి ఎప్పుడూ అనే మాట.
‘నాగేటి సాలల్లో…’ అనే పాటకుగాను నాకు ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు వస్తుందని తనేమాత్రం ఊహించలేదని సిధారెడ్డి గారంటారు. ఎందుకంటే గత 14 ఏళ్ళుగా అనేక మంది ఈ పాటను పాడుతున్నారు. బాగా పాపులర్ అయిన పాట అంది. 1997 ఆగస్టు 16వ తేదీన షేక్ బాబా అనే గాయకుడు ఓ పాటను రాసివ్వండి… బహిరంగ సభలో పాడుదాం అని అడిగినందుకు ఆ మరుసటి రోజే అంటే ఆగస్టు 17వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ పాటను రాసిచ్చేశారట. ఆ పాటకు ఆయనే ట్యూన్ కట్టుకుని బహిరంగ సభలో పాడారు. అలా మొదలైన ఆ గేయాన్ని దేశపతి శ్రీనివాస్ అనేక సభల్లో పాడి పాపులర్ చేశారు. ఈ పాట ప్రజల్లోకి వెళ్ళడానికి ఆయన పాడటమూ ఓ కారణం. ఓ రోజు ఆర్.నారాయణమూర్తి సిద్ధిపేటలో ఉన్న సిధారెడ్డిగారి ఇంటికి వచ్చి ఈ పాటను తన సినిమాలో పెట్టుకుంటానని అడగడమూ…వీరు వెంటనే ఒప్పుకోవడమూ జరిగిపోయింది. ఈ పాటను తన సినిమాలో జె.ఏసుదాసుతో పాడించారు. సినిమాల్లోకి వెళ్ళాలని సిధారెడ్డిగారి చిన్నప్పటి నుంచి వున్న కోరిక ఆవిధంగా నంది అవార్డు రావడంతో తీరిందేమో. కానీ ఉద్యమం బాటలో నడిచే క్రమంలో సినిమాకోసం అటుతర్వాత ఆయన సమయాన్ని ఇవ్వలేకపోయారట.
ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే పాటలను రాయాలనేదే వారి సంకల్పం. ఇప్పటి వరకు 25 పాటలు రాస్తే అందులో పది పాటలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి. 1992లో జరిగిన మద్యపాన వ్యతిరేఖ ఉద్యమానికి సంబంధించి ఓ ఐదు పాటలను, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఓ పాటను, ప్రజా ఉద్యమాలకు సంబంధించి తొమ్మిది పాటలను రాశారు.
మే 2012లో సిధ్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధిపతిగా పదవీ విరమణను చేశారు.
( వేర్వేరు ఆధారాలనుంచి సేకరించిన సమాచారం మేరకు తయారు చేసిన వ్యాసం ఇది, సవరణలూ పూరణలూ వుంటే తెలపండి )దేశపతి శ్రీనివాస్ గారు పాటలో
నాగేటి చాళ్ళల్లో నా తెలంగాణా నాగేటి చాల్లల్ల నా తెలంగాణా నా తెలంగాణా
నవ్వేటి బతుకులు నా తెలంగాణా నా తెలంగాణా పారేటి నీల్లల్ల – పానాదులల్ల పూచేటి పువ్వుల్ల – పునాసలల్ల కొంగు చాపిన నేల నా తెలంగాణా నా తెలంగాణా పాలు తాపిన తల్లి నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|
తంగేడు పువ్వుల్లు – తంబాలమంతా తీరొక్క రంగుల్ల – తీరిచీనా పువ్వు బంగారు చీరలు బజారులన్నీ బతుకమ్మ పండుగ – నా తెలంగాణా నా తెలంగాణా బంతి పూలతోట – నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|
వరదగూడు గడితె వానొచ్చునంట బురద పొలమూ దున్ని మురిసున్నరంతా శివుని గుల్లె నీల్లు చీమలకు శక్కరి వాన కొరకు భజన – జడకొప్పులేసి వాగుల్ల వంకల్ల – నా తెలంగాణా నా తెలంగాణా చూపు రాలిన కండ్లు – నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|
కొత్త బట్టల్లు గట్టి – కోటి ముచ్చట్లు పాల పిట్టల జూసి – పడుచు చప్పట్లు జొన్న కర్రల జెండా – జోరున్నదేమి అలయి బలయి దీసె – నా తెలంగాణా నా తెలంగాణా జంబి పంచిన ఆర్తి – నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|
మోటగొట్టే రాత్రి – మోగీన పాట తాడు పేనిన తండ్రి – తలుపులున్నప్పు కల్లమూడ్సిన అవ్వ – కలలోని గింజ ఆరుగాలం చెమట – నా తెలంగాణా నా తెలంగాణా ఆకలిదప్పుల మంట – నా తెలంగాణ నా తెలంగాణా |నాగేటి|
ఊరు గాచే తల్లి ఉరిమి చూడంగ బువ్వలేని తల్లి బోనమొండింది సేనుకొచ్చిన పురుగు సెరిగిబోసిందా బోనాల పండుగ – నా తెలంగాణ నా తెలంగాణా కాట్రావుల ఆట – నా తెలంగాణా నా తెలంగాణా శివసత్తుల ఆట – నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|
దట్టి గట్టిన రోజు దప్పు చప్పుల్లు పీరీల గుండంల పిలగాండ్ల ఆట కుడుకపేర్ల మొక్కు కూలి బతుకుల్లు ఆలువాడిన పాట – నా తెలంగాణా నా తెలంగాణా ఆత్మగల్ల చెయ్యి – నా తెలంగాణా నా తెలంగాణా
కలిసేటి సేతుల్ల కన్నీటి పాట సిందోల్ల సిందుల్ల సిగురించె నాట్యం వొగ్గు మద్దెల డప్పు వాద్య సంగీతం కళలకే పుట్టుకా – నా తెలంగాణా నా తెలంగాణా పాటగాచిన పట్టు – నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|
తాడూ పేనిన తండ్రి తలుపులున్నప్పుడు మంటలేని కొలిమి బతుకుల్ల మంట నీళ్లు లేని చెరువు నిను జూసి నవ్వె బతికి చెడ్డా బిడ్డ – నా తెలంగాణ నా తెలంగాణా తల్లడిల్లే తల్లి – నా తెలంగాణా నా తెలంగాణా |నాగేటి|
బురుజు గోడల పొగరు మెడలు వంచంగ గుట్టల్ల చెట్లల్ల గోగు పువ్వుల్లు సద్ది మోపిన తల్లి సావు బతుకుల్ల పానమిచ్చిన వీర కథలు బతుకంగ
గోరుకొయ్యల పొద్దు – నా తెలంగాణా నా తెలంగాణా గోరువంకల సభలు – నా తెలంగాణా నా తెలంగాణా
సంక్రాంతి పండుగ సందర్భంగా వ్యవసాయ బావుల వద్ద రైతులు జరుపుకునే ‘‘కాట్రావుల పండుగ’’ గురించి కూడా పాటలో పేర్కొన్నారు దాని వివరాలు తెలియవు.
పునాస వువ్వులు : The first crop of the year which consists of grain of an inferior kind వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయదారులు ఆయా పైరులను విత్తి పెంచు కాలము. సంవత్సరమును పునాస (ఎండ) కారు, తొలకరి (ముంగటి వానకారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అని ఆరుకారులుగా వ్యవసాయాధారితంగా విభజింపవచ్చును (Sowing seasons).
జూన్ నెలలో (పునర్వసు కార్తెలో) చల్లు పంట.
మామిడిలో ఒక రకము.( మామిడి కాయలు పునాసపిందెలు బజార్లోకి వస్తున్నాయి అనే వాడుకను వింటుంటాం)
తాంబూలంలో తంగేడుల పేర్పు, బతుకమ్మ పండుగకు చేసే ఏర్పట్లలో బాగంగా పువ్వులు పేర్చే ఇత్తడి లాంటి లోపపు పళ్ళేన్ని తాంబూలం అంటారు.
వరదగూడు / వరదగుడి ( చంద్రునిచుట్టు ఏర్పడు వృత్తాకారం లేదా పరివేషము) దూరాన్ని బట్టి వర్షాన్ని అంచనా వేస్తారు,
భజన, కోలాటంలో జడకొప్పులాట, దసరాకు కొత్తబట్టలూ,పాలపిట్టలూ, అలయ్ బలయ్ లు, జమ్మిఆకు పంచుకోవడం గురించి చెప్పారు.
చితికిపోతున్న జానపద కళల్లో ప్రజాదరణ, బహుళ ప్రాచుర్యం పొంది చిందు యక్షగానం. కాకతీయుల కాలంలో పురుడు పోసుకున్న ఈ చిందు బాగోతం చిందు యక్షగానంగా ప్రసింది చెందింది. చిందు బాగోతం ప్రదర్శించిన పల్లె లేదంటే ఆ కళారూపం ఎంతగొప్పదో మనం అర్ధం చేసుకోవచ్చు. చిందు కళాబృందంలో 20 నుంచి 30 మంది కళాకారులు ఉంటారు.చిందు కళాకారుల కుటుంబంలో ఆరు నెలల పసిపాప మొదలుకొని అందరూ కళాకారులే. గ్రామం నడిబొడ్డున ‘చాందిని’ వేసి, చిందు ప్రదర్శన ఉందని చాటింపు వేసి ఊరంతా తిరిగి చెప్పేవారు. సాయంకాలం మసక చీకటి ప్రారంభానికి ముందే గ్రామ ప్రజలంతా ఈత చాపలు, జోరసంచులు, గొంగళ్లు, గడె మంచాలు వేసి వారు కూర్చునే స్థానాలను ముందే ఆక్రమించుకునే (రిజర్వ్) వారు. ’లాయిరి’ (బందరమియ్యా)గాని రాకతో యక్షగానం ప్రారంభమయ్యేది. పౌరాణిక గాథలు ఈ చిందు యక్షగానంలో ప్రధాన కథాంశాలు. చిందు కళాకారులు వేషధారణ ప్రదర్శిస్తూ, పాటపాడుతుంటే వారి కుంటుబాలలోని మహిళలు తాళం వేస్తూ కోరస్ పాడేవారు. మద్దెల, హార్మోనియం, తాళాలు ప్రధాన సంగీత పరికరాలు. కిరీటాలు, బుజకిరీటాలు, పట్టువస్త్రాలు తదితరాలు ఆహార్యాలుగా ఉండేవి.
ప్రేక్షకుడిని విరామం లేకుండా కట్టి పడేసే కళ ఒగ్గు కథ. బోనం ఎత్తుకొని, వేప మండలు పట్టుకుని ఊగుతూ, తూలుతూ ఎల్లమ్మ కథ చెప్తుంటే జనం ఊగిపోతారు. బోనం నెత్తిమీద పెట్టుకొని, ఎంతో సేపు దాన్ని కదలనివ్వ కుండా కింద వేసిన నాణాల్ని నొసటితో అందుకునే దృశ్యం అద్భుతం. జానపద కళారూపాళ్లో ‘ఒగ్గు కథ’ ప్రముఖమైంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం – గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఒగ్గు కథ. ఈ కథా ప్రక్రియకు, చదువు అవసరం లేదు. డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో, తెలంగాణ భాషలో గంటల కొద్ది ఎన్నయినా కథలు చెబుతారు. పాటలు జోడించి కథను పండిస్తారు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తారు. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతారు.
కురబ జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. కురుమలకు ప్రత్యేక పూజారులు, కుల వాయిద్యకారులు ఉన్నారు. తెలంగాణలో ఒగ్గువాళ్లు, బీరప్పలు, రాయలసీమలొగొరవయ్యలు అని వీరిని పిలుస్తారు. వైవిద్యం కలిగిన ఒగ్గుకథ గాన, కళారూపం ఒక్క తెలంగాణాలోనే కనిపించడం విశేషం. కురుమ కుల పురోహిత వర్గానికి చెందినవారు ఒగ్గుకథని చెప్పే వృత్తిని స్వీకరించారు. బీరన్నలకు ప్రత్యేకమైన వాయిద్యం ఒగ్గు (ఢమరుకం) ఉపయోగించి చెప్పే వృత్తి పురాణం గురించి తెల్సుకోవడం అంటే కురుమ జాతి చరిత్ర, సంస్కృతుల్ని గురించి తెలుసుకోవట మన్నమాట. ఒగ్గు దీక్ష ఒకటి ఈ కురుమల్లో కనిపిస్తోంది. ఒగ్గు కథలో తర్ఫీదు పొందాలంటే కులపెద్దల అనుమతితో శైవక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలువేసి విభూతి ధరించి, నామాలను జపించుకొంటూ మల్లన్న దేవుడినే ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతులు మంత్రం బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన ఏడు గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. ఈ ఒగ్గు దీక్ష తర్వాతే వారు [[బీరన్న, మల్లన్న కథలు[[ చెప్పేందుకి అర్హత సంపాదించు కొన్నట్లు అవుతుంది. కురుమలు బీరప్ప దీక్ష తీసుకున్న వాళ్లు బీరప్పలవుతారు. ఈ సంప్రదాయం పూర్వం నుంచే వస్తోంది. కురుమల్లో పౌరోహిత్యం చేసేది ఈ ఒగ్గులే. కొంత మంది ఒగ్గులు దేవుని పెట్టెలో మల్లన్న దేవుని విగ్రహాలు పెట్టు కొని కావడి కట్టుకొని ఊరూరా తిరుగుతారు. వీరు నెత్తి విరబోసుకోని, నుదిటిని పసుపు రాసుకొని, కళ్లకి కాటుక రాసుకొని ఎర్రని పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి కాళ్లకి గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తూ శైవగీతాలు పాడతారు.
సద్ది మోయడం, ముందురోజు రాత్రి వండిన ఆహారపదార్దాలను తెల్లవారగట్ల పనిలోకి వెళ్లేముందు కట్టుకుని తీసుకువెళ్లేవారు. బతుకమ్మ పండుగలో భాగంగా సద్దులు మోయటం అనే సంప్రదాయం కూడా వుంది.
గొరుకొయ్యల పొద్దు(సప్తర్షి మండల దర్శనం) ఆర్ద్రానక్షత్రము, గొర్తి కొయ్యలవలె వరుసగా ఉండు మూడు నక్షత్రములు, గొర్తి కొయ్యలు. — గడియారాలు వాడని ఆ రోజుల్లో రాత్రిసమయాన్ని లెక్కించేందుకు నక్షత్రగమనాన్ని ఆధారంగా తీసుకునే వారు.
ఇవన్నీ ఒక సంస్కృతిని తమ భుజాలపై మోస్తున్న మాటలు వాటిని పాటలో అల్లి జనాలకు అందించిన కవి నిజంగానే ధన్యుడు కదా. వీటిలో ఒక్కో పదానికి పూర్వాపర వివరణ ఒక్కో పెద్దవ్యాసమో గ్రంధమో అయ్యేంతటి విస్తారమయినవి.
చూస్తే పసితనమే, కానీ ఏదో తెలియని మేధస్సు నిండుగోదారిలా ప్రవహిస్తున్నట్లుంటాడు. ఇన్నాళ్ళూ పేస్ బుక్ లోనే బుల్ బుల్ లై బులిపించిన అక్షరాల అలలు ముద్రితమై మనచేతుల్లోకి రాబోతున్నాయి.
అక్షరాలా అక్షరాలలో బ్రతికే వాళ్ళకి పుస్తకం ఒక నిండుపండగే కదా..