భల్లాల దేవుడికి సాధ్యం కానట్లు అనిపిస్తే అది అసాద్యమైపోదు. మరికొంచెం ఆలోచించి అడుగేస్తే అటు ప్రజలను కాపాడుకుంటూనే శత్రువుపై దెబ్బతీసే అవకాశం దొరుకుతుంది.
from Blogger http://bit.ly/2fR4zup
via IFTTT
భల్లాల దేవుడికి సాధ్యం కానట్లు అనిపిస్తే అది అసాద్యమైపోదు. మరికొంచెం ఆలోచించి అడుగేస్తే అటు ప్రజలను కాపాడుకుంటూనే శత్రువుపై దెబ్బతీసే అవకాశం దొరుకుతుంది.
from Blogger http://bit.ly/2fR4zup
via IFTTT
సరే ఒకసారి నాకు అర్ధమయినంత వరకూ నేను పరిశీలించిన విశేషాలు మీముందుంచుతాను. మరేమైనా సవరణలుంటే పెద్దలు, విజ్ఞలు తెలియజేస్తే సంతోషంగా భావిస్తాను.
బంగారు అంటూ గ కు దీర్ఘం ఇస్తే ఆటవెలదిలో పొసగటం లేదు |
తాయత్తులు అంటే అస్సలు సరిపోవడం లేదు |
సిరిమువ్వలు కూడా గణ విభజనలో కుదరటం లేదు. |
కృష్ణుడు చిన్నవాడే అయినా దీర్ఘం తీయకుండానే ఈ పద్యంలో పలుకుతాడ్లెండి |
ఈ విధంగా చిన్ని కృష్ణుడి రూపాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించిన కవి, చివరి పాదంలో తన భక్తిభావాన్ని చాటుకున్నాడు. అయితే కృష్ణా అంటూ దీర్ఘం తీస్తూ చాలా మంది పద్యాన్ని పాడుతున్నారు కానీ దీర్ఘం లేకుండా ఆటవెలదికి చక్కగా సరిపోతోంది.
from Blogger http://bit.ly/2f0moXG
via IFTTT
from Blogger http://bit.ly/2de83or
via IFTTT
గుంజాల గోండి లిపి దినోత్సవ సందర్భంగా
గోండు భాష : ఆదిలాబాదు మరియు బస్తర్ జిల్లాల్లో గోండు గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.
ఆ ప్రాంత మంతా ఈ నాటికిమధ్య ప్రదేశ్ లో ఛత్తీస్ ఘడ్ గా పిలువబడుతూ వుంది. ఆంధ్ర దేశాన్ని ఆనుకొని వున్న ప్రాంతాలైన, చాందా, సిరువంచా, బస్తర్ మొదలైన సంస్థానాలను రాజ గోడులు పాలించారు.
గుంజాల గోండీ లిపి అధ్యయన వేదిక |
ఈ రాత ప్రతులను మొదట చూసినప్పుడు మరాఠీనో, దేవనాగరి లిపో అనుకున్నాం. కానీ, అది ఒక విలక్షణమైన లిపిగానే కనిపించింది. అందుకే ఆ లిపిని గోండు పిల్లలకు నేర్పించాలని భావించాం. ఏడాదికింద అఖిల భారత గోండ్వానా గోండి సాహిత్య పరిషత్ జిల్లా మహాసభ జరిగింది. ప్రతి ఏడాది జనవరి 27 గుంజాల గోండీ లిపి దినోత్సవం జరపాలని అప్పుడు నిర్ణయించారు. ఈ ఏడాది కూడా ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో తెలుగు తరవాత భాషా దినోత్సవాన్ని జరుపుకున్న ఘనత గోండులదే. గుంజాల లిపే వారికి ఆ ప్రేరణ.
‘గుంజాల గోండీ లిపి అధ్యయన వేదిక’ తరఫున చాలా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఐటీడీఏ ఉట్నూరు, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఫర్ దళిత్, ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్లేషన్’ (సిడాస్ట్) సహకారంతో మొదటిసారిగా గోండీ లిపిలో మొదటి వాచకం అచ్చేస్తున్నారు. గుంజాల గ్రామంలో లిపి అధ్యయనం కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాజెక్టు ఆఫీసర్ జే. నివాస్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ లోగా సిడాస్ట్ గుంజాలకి ఒక పరిశోధక బృందాన్ని పంపింది. జయధీర్, ఆచార్య వి.కృష్ణ ఆధ్వర్యంలో గోండీ లిపిలోని రాత ప్రతులను హిందీ, తెలుగు భాషలలోకి అనువాదం చేసే పని అక్కడ జరుగుతోంది. ఈ లిఖిత సమాచారంలో గోండీ ప్రజల ఆచారాలు, చరిత్ర వెల్లడవుతున్నాయి. ఈ లిపిపై గోండీ పిల్లలు ఆసక్తిగా ఉన్నారు. ఆరో తరగతి చదివే విఠల్ రెండో తరగతి చదివే పిల్లలకు, ఈ లిపిలో అక్షరమాలను, గుణింతాలను నేర్పుతున్నాడు. లాల్షావు (75) కోట్నక్ జంగు (72) తమ ఆత్మకథలను గుంజాల గోండి లిపిలో రాస్తున్నారు. వాటిని శ్రీధర్ శ్రీకంఠం తయారుచేసిన సాఫ్ట్వేర్ సాయంతో ఆ లిపిలోనే డీటీపీ చేసి పుస్తకం ముద్రించేందుకు రంగం సిద్ధమైంది.
అంటే గోండీ లిపిలో, గోండీ భాషలో అవి మొదటి ఆత్మకథలు అవుతాయి. ఎం.ఏ (తెలుగు) చదివిన కోట్నక్ వినాయక్ తెలుగు నుంచి గుంజాల లిపిలోకి అనువాదం చేయగలడు. అతని సహాయంతో గుంజాల గ్రామంలో లిపి అధ్యయన కేంద్రం కూడా ప్రారంభం కాబోతున్నది. అక్కడ ఒక గోండీ భాషా పాఠశాలకు అంకురార్పణ జరుగుతున్నది. అనువాదం పనిలో ఉండగా గోండీ-తెలుగు భాషలకున్న అనుబంధాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలిగింది. వందలాది గోండీ పదాలు తెలుగులో ఉన్నాయి. తెలుగు భాషా మూలాలే కాదు, సాంస్కృతిక, చారిత్రక లోతులు కూడా తెలుస్తాయని నమ్మకం. బౌద్ధుల నలందలాగా గోండీ లిపి భాషా విషయాలకు గుంజాల కూడా విశ్వవిద్యాలయంగా ఎదగాలని కోరుకుందాం.
కొన్ని గోండీ భాషా పుస్తకాలను ఇక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
ధన్యవాదాలు
సాక్షి పత్రికలో జయధీర్ తిరుమలరావు గారి వ్యాసం
కొండ బతుకులు.. గోండు కథలు బివిఎన్ స్వామి గారి వ్యాసం
ఆదివాసీ భాషల మాటేమిటి? – ప్రొ. భంగ్యా భూ
రాక్ స్టార్ గా మహేష్ బాబు, జర్నలిస్టు సనమ్ గా కృతిసనన్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ట ఈ రొటీనంతా చెప్పను కానీ మహేష్ బాబు దక్షిణాది హృతిక్ లా కొత్తగా వున్నాడనే ముక్క మాత్రం చెప్పాలి.
1) తమపై జరిగిన దాడినుంచీ తప్పించుకునేందుకు కార్ పార్కింగ్ లోని చాలా కార్ల తాళం చేతుల్ని గుప్పెట నిండా తీసుకుని ఒక్కొక్కటీ పారేసుకుంటూ వస్తాడు. నాకర్ధం కాలేదు ముందు తర్వాత తనకి దగ్గరలో బజర్ ఏది రింగయితే ఆ కారు వాడుకునేందుకు చేసిన ప్లాన్ అని ఇలాంటి కథనంతో పాటు వచ్చే మైండ్ గేమ్స్, లాజికల్ సీక్వెన్సెస్ బావున్నాయి.
ఫోటో సీక్వెన్స్ ల నుంచి నంబరు తీయటం. రూబిక్స్ కి బ్యాంక్ లోగో నంబరు కలపటం ( తండ్రి ఎలాగూ శాస్త్రవేత్త కదా),
2) రత్నవేలు కెమెరా పనితనం మొదటి షాట్ లో లైటింగ్ లో నీళ్ళమధ్యనుంచి కనిపించే రాళ్ళను చూపించటం దగ్గరనుంచి ఛేజింగ్ షాట్ల వరకూ అన్నీ బాగా నడిచాయి.
3) ముఖ్యంగా పీటర్ హేన్స్ హాలీవుడ్ సినిమాను మరిపించేలా స్టంట్ సీక్వెన్స్ లను అల్లాడు. రోడ్ బైక్ కార్ చేజింగ్ లు, మిడ్ సీ యాక్షన్ సీన్ లు గుర్తుండి పోయేలా తీసారు. అడ్డంగా వదిలిన బైక్ వల్ల పైకి లేచి తనమీదుగా వెళుతుండటాన్ని హీరో గమనించటం ఒకటి స్లోమోషన్ లో తీసిన సీన్ కథ ప్రకారం ఊహే కానీ ఒన్నాఫ్ ది హైలెట్. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో వుందనే విషయాన్ని విమర్శకులు కూడా కాదనటం లేదనుకుంటాను.
4) విలనెవరో తెలిసి పోరాడటం చూస్తూనే వున్నాం నిజంగా వున్నాడా లేడో తెలియదు. తనది బ్రమో నిజమో తెలియదు. బయటి వాళ్ళతోనే కాదు మనతో మనకీ పోరాటమే మధ్యలో వదిలేస్తే గోల్డెన్ రైస్ లాంటి నిధే కాదు. అంతకంటే విలువైన జ్ఞాపకాల ఆల్పం సైతం దొరకదు. ఇంటర్వెల్ కిముందే ఒక విలన్ ని చాలా కూల్ కామిక్ సిట్యుయేషన్ లో చంపేయటం రెగ్యులర్ హై వెయిట్ రివేంజ్ సీక్వెన్స్ లకు చాలా భిన్నంగా కొత్తగా ఊహించారు.
5) అనవసరమైన రొటీన్ కామెడీ లేదు కానీ కథానుగుణంగా వచ్చే సన్నివేశాలు ఆ కొరతను కొంతమేరకు తీర్చాయి.
6) దేవిశ్రీప్రసాద్ పాటల్లో హూ ఆర్ యూ కథకు బాగా అతికింది. మిగిలినవి స్పీడ్ గా అయితే వున్నాయి.
లండన్ టాక్సీ డ్రైవర్ గా పోసాని, ముఖ్యమైన కొన్ని పాత్రల్లో నాజర్ నాజర్, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జి, షాయాజి షిండే, ఆనంద్, లు చేసారు.సినిమా చూసిన తర్వాత కథ రచయిత పేరుకోసం వెతుక్కున్నాను జక్కా హరిప్రసాద్ అట. విజువల్ మీడియం కొసం కంటే నవలలా మరింత బాగా పనికొచ్చెలా తయారు చేసినట్లున్నారు.
(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));
Narayana Sharma Mallavajjala |
శిష్యులతో ఆది శంకరాచార్య |
భలేమంచి సమయం
ఏ కాలం వాడు ?
శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు శంకర విజయ అన్న పేరుతో పిలుస్తారు..
మొసలినుంచి తప్పించుకోవాలంటే సన్యాసిగా మరేందుకు అనువతివ్వమ్మా |
తీసుకుంటాడు. ( భవభందాలనే మొసలినుండి విడివడ్డానని రచయత చమత్కారం కూడా బావుంది) సాధారణ జనంపై గట్టిప్రభావం వెయ్యాలంటే మహిమలు తప్పనిసరి అప్పటికి వెయ్యేళ్ళక్రితం నుండీ నాస్తికతలోనుండీ పుట్టినప్పటికీ తన ప్రభావం చూపిస్తున్న బౌద్దానికైనా జాతక కథలు చెప్పటం తప్పలేదు. మహిమాన్విత విషయాలను ప్రచుర్యం చేయకా తప్పలేదు.
కలిసి వచ్చిన సజ్జన సాంగత్యం
ఛండాలునిగా నాగార్జున |
నాలుగు శునకాలతో ఒక ఛండాలుడు (ఈ పాత్ర నాగార్జునా చేశారు) అడ్డువస్తాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ ఛండాలుడు ఈ విధంగా అడిగాడు.
అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
వేదాలనే నాలుగు కుక్కలతో ఛండాలునిగా భోద |
మండన మిశ్రునిగా సాయికుమార్ |
ఇదే విషయంలో ఫ్రొఫెసర్ యమ్ ఎస్ భట్నాగర్ విశ్లేషణ స్క్రిబిడ్ కాపీ ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
ఎప్పుడో చాలకాలం క్రిందట రాసుకున్న వాక్యాలివి. అంతగా దూసుకుపోయే కవితలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయ్. అలా నాకు కన్పించిన రెండు కవితలు పి.రామకృష్ణ గారి, భగవాన్ ఉవాచ, ఎప్పట్లాగే.
రెండవకవిత “ఎప్పట్లాగే ‘” చదవగానే ఇంత ఆలోచనత్మకంగా, ఇంత సులభంగా చిన్న ఘటనను కవితగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. అరే, ఇలా మనం రాయలేకపోయామే అనిపిస్తుంది కూడా.
చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పండి అన్న సామెత గుర్తుకొస్తుంది. ఒక చిన్న సంఘటనను, ఒక మంచి మార్గాన్ని సూచిస్తుందీ కవిత. ప్రకృతి పట్ల ప్రేమని, పర్యావరణం పట్ల బాధ్యతను చాలా సరళంగా స్పృశిస్తుంది. పిట్టగోడలు తప్ప పచ్చని చెట్లు కనిపించని నగరవాతావరణాన్ని ప్రశ్నిస్తుంది కూడా.బడిపిల్లల పాఠ్యపుస్తకాలలో వుంచదగ్గ కవిత ఇది,.
—————-
పి.రామకృష్ణ // ఎప్పట్లాగే
గుప్పెడు గింజల్నీ,
గిన్నెడు నీళ్ళనీ,
పిట్టగోడపై వుంచి
ఎదురుచూస్తున్నాను.
చెట్లను వెతుక్కుంటూ-
ఈ పక్షులన్నీ
ఎక్కడికి వెళ్ళాయో?
** ** **
ఎప్పట్లాగే
గుప్పెడు గింజల్ని చల్లి,
వాటిమీద-
గిన్నెడు నీళ్ళను పోసాను.
నాకు తెలుసు
పిట్టల కోసం వెతుక్కుంటూ
ఈ చెట్టు
ఎక్కడికీ వెళ్ళదు.
———-
కవిత్వాన్ని విభజించు అని నాకెవరైన అవకాశం ఇస్తే సజీవకవిత్వం, నిర్జీవకవిత్వం అని రెండు భాగాలుగా విడదీస్తానేమో! దేని ప్రాధాన్యత దానిదే అయినా కొన్ని సార్లు చటుక్కున జీవం ఆకట్టుకున్నంత సహజంగా ఇంకోటి ఆకట్టుకోదు.
పదాడంబరం చేతనో, లయచేతనో, కవి చేసే కనికట్టు వల్లనో కవిత్వం ఆకట్టుకోవచ్చు కాని మనుసు పొరల్లో తెరలు తెరలుగా అలలు, ఒక అలజడి రేకెత్తించలేకపోతే అది వస్తు కవిత్వమే.
కఠినమైన వాస్తవాన్ని, సత్యాన్ని, ఒక తాత్వికతను ఇంత సున్నితంగా చేయి తిరిగిన చిత్రకారుడిలా కేవలం రెండే రెండు దృశ్యాలతో హృదయపు కాన్వాస్ పై చిత్రించడం సామాన్యమైన విషమేమి కాదు.
మొదటి కవిత “భగవాన్ ఉవాచ” చదవగానే మొదటి దృశ్యం సర్వసాధారణంగా అనిపిస్తుంది. రెండో దృశ్యం జతకూడగానే ఎవరో చెంప చెళ్లుమనిపించినట్లు కళ్లలో నీరు సుడితిరగక మానదు. మనసు మూగగా రోదిస్తుంది భగవంతుడు ఎంత నిర్ధయుడో కదా అని.
ఎక్కడా అయోమయం ఉండదు, అస్పష్టతా ఉండదు. చెప్పదలుచుకున్నది అలవోకగా గుండెకు అతకబడుతుంది. అలజడి తగ్గి స్థిమితంగా ఆలోచించడం మొదలు పెడితే గీతాసారాంశం కళ్లకు కడుతుంది. జరిగేది జరగక మానదని ,.ఇంకొంచెం తిక్కగా ఆలోచిస్తే నాస్తికత్వాన్ని భుజాన మోస్తున్న కవిత గా చెప్పుకోవచ్చు. ( కవికి ఆ ఉద్దేశ్యమే లేక పోవచ్చు అది వేరే విషయం) రెండు ఒకటి అని ఇచ్చిన సృజనాత్మక నెంబరింగ్ కూడా ఆకట్టుకుంటుంది ఈ చిన్న కవితలో. ఎక్కడైనా ఆదివారం అని కనిపిస్తే చాలు కవిత మొత్తం కళ్లముందు నిలబడిపోతుంది. బహుశా ఏ ప్రయత్నం చేయకుండా నాకు పూర్తిగా కంఠస్తమైన కవితకూడా ఇదొక్కటేనేమో.
—————-
శ్రీ. పి.రామకృష్ణ
పి.రామకృష్ణ // భగవాన్ ఉవాచ
2. ఆ ఆదివారపు మధ్యాహ్నం
ఓ చిన్నారి కోడిపిల్ల
అమ్మకోసం వెతుకుతూ, వెతుకుతూ..
దార్లో-
కారు టైరు క్రిందపడి,
చనిపోయింది.
1. అదే ఆదివారపు ఉదయం
తల్లికోడి-
కసాయి కత్తిక్రింద కంఠాన్ని వుంచి,
కళ్లు మూసుకుని, ఇలా ప్రార్థించింది.
“భగవంతుడా ఇలాంటి చావు-
నా బిడ్డకు రాకుండా చూడు” అని.
———–
మొదటగా చెప్పుకోవలసిన రెండు మాటలు చివరలో చెప్తున్నాను.
కవిత్వం నచ్చడమనేది వ్యక్తిగతం.
కవిత్వమనేది ఓ కనెక్టివిటి.
ప్రతి కవితకు ఒక ఫ్రీక్వన్సీ వుంటుంది, అది పాఠకుడి ఫ్రీక్వెన్సీ కలవగలిగితేనే అది హత్తుకుంటుందనుకుంటాను నేను.
ప్రతి పాఠకుడి ఫ్రీక్వెన్సీకి అడ్జస్ట్ అయ్యే కవితలు గొప్ప కవితలవుతాయ్. ప్రతి కవిత ఫ్రీక్వెన్సీకి అడ్జస్ట్ అయ్యే పాఠకుడు గొప్ప పాఠకుడౌతాడేమో?!
రెండో విషయం కనెక్టవిటి. కవి కుక్క గురించి ఫీలై కవిత రాస్తే చదివిన పాఠకుడు ఏనుగనుకుని కవిని నెత్తిన పెట్టుకొని పొగిడేస్తే ఆ కవిత ఫెయిలైనట్లే. కవి కూడా…
కవి ఏమనుకున్నాడో కవిత దాన్నే ప్రతిఫలించాలి. అదే పాఠకుడికి కనెక్ట్ అవ్వాలి. ఆ విషయంలో పై రెండు కవితలు పూర్తిగా విజయం సాధించాయనుకుంటాను.
బహూశా కొంత మందికి నచ్చకపోవచ్చు. కవిత్వం నచ్చడం వ్యక్తిగతం కావడంవల్ల.
—————————————14/7/2013,.17.18
అంత మంచి కవిత,కాల ప్రవాహానికి ఎదురీది కలకాలం గుర్తుండిపోయే కవిత రాయాలంటే కవికి ఎటువంటి మానసిక స్థితి ఉండాలి? ఎలాంటి శిక్షణ కావాలి? ఇవన్నీ కవిత్వాన్ని చదువుతూ లేక రాస్తూ ఉన్నవారికి కలగాల్సిన అనుమానాలే,సందేహం లేదు.
మొదటిది: మానసిక స్థితి
సమస్యకు స్పందనను యధాతధంగా రాసిపారేయడం కవిత్వం కాదు.నిజానికి సమస్యకు కావాలసింది పరిష్కారం,కవిత్వం కాదు. సమస్య గురించి కవి తాను ఆవేదన చెంది పాఠకుడిని చైతన్య పరచదల్చుకుంటే ఆ విషయానికి సరి అయిన కవిత్వ రూపం ఇచ్చి మనసుకు హత్తుకునేలా సున్నితంగా చెప్పగలగాలి కానీ తిట్లు, విద్వేషాలు,శాపనార్థాలూ కవిత్వం కాదు.
కేవలం ఒక వర్గానికో కులానికో మతానికో తనని తాను పరిమితం చేసుకుని ఆ వర్గం,కులం లేదా మతానికి సంబంధించిన సమస్యలపైనే కవిత్వం అల్లే సంకుచిత మానవుడు కవి ఎలా అవుతాడు? విశ్వ నరుడే కవి కాగలడు.
ఆవేశాల్లోంచీ ఆక్రోశాల్లోంచీ పుట్టేది ఒక స్థాయి కవిత్వం మాత్రమే.కేవలం దిగులుని,దుఖాన్ని “గ్లోరిఫై” చేయడం కవిత్వం కాదు.కవిత్వం పాఠకుడి మానసిక స్థాయిని పెంచాలి.కవిత్వం చదిన తరువాత మనిషి మరి కొంచెం ఉన్నతుడు కావాలి.
అన్ని బాహ్య ప్రభావాలనూ, ఆలోచనలనూ వదిలి పెట్టాలి కవి. అన్ని సామాజిక విలువల వలువలను మురికి గుడ్డలను వదిలినట్టు వదిలేయాలి కవి. ఏకాంతంలో తన్ను తాను దర్శించుకోవాలి. ఈ విశాల ప్రకృతిలో, అప్పుడే పుట్టిన పాపాయిలా స్వచ్చంగా స్పందిస్తూ ఆ అనందంలో మమేకమవ్వాలి. అప్పుడు అల్లాంటి మానసిక స్థితిలోంచి పుట్టేది గొప్ప కవిత.
రెండవది: పదాల ఎంపిక
ఎల్లాంటి పదాలను వాడాలి? సరళమైన పదాలనూ,వినసొంపైన తేట తెలుగు పదాలనూ వాడాలి.ఏ ఏ పదాలు కలిస్తే కవిత అందం పెరుతుందో కవికి తెలియాలి.ఏ ఏ పదాలు కలిస్తే కవిత అందం చెడుతుందో కూడా తెలిసిపోవాలి.పదాలను పొదుపుగా వాడడంలో నైపుణ్యం సాధించాలి. ఇంగ్లీషు,ఉర్దూ,హిందీల్లాంటి అన్య భాషల పదాలను తెలుగు పదాలతో కలిపి కాలకూట కషాయాలను కాచి పాఠకుల చేత బలవంతంగా తాగించడం భావ్యం కాదు.
తెలుగు కవిత్వం తెలుగులోనే ఉండడం సమంజసం.
ఢమఢమలాడే పదాలను తెచ్చిపోస్తే అది ఘనమైన కవిత్వం అయిపోదు.
పాఠకుడిలో సున్నితమైన భావాలను మేలుకొలిపేదే కవిత్వం.
మూడవది: కల్పనాశక్తి
కవికి ముఖ్యంగా కావలసింది భావనా బలం,కల్పనా శక్తి. అల్లాగని ఊహలోంచి ఊహ,ఊహలోంచి ఊహలోకి వెళ్ళిపోతూ పాఠకులను గందరగోళానికి గురిచేయకూడదు. సరళంగా చెప్పగలగాలి.కవితకి ఒక తుది మొదలూ ఉండాలి.ఎక్కడించి ఎక్కడికో వెళ్ళిపోయి పాఠకుడిని గజిబిజి గల్లీల్లో వదిలేసి రాకూడదు. పదచిత్రాలే కవితకు ప్రాణం.
నాలుగవది: రూపం
వచన కవిత్వం అన్నారు కదా అని తుది మొదలూ లేకుండా వాక్యాలు వాక్యాలు రాసిపారెయ్యడం పరిపాటిగా మారింది తెలుగు దేశంలో.చందోబందోబస్తులు తెంచుకుందంటే దానర్ధం ఒక రూపం,నిర్మాణం,లయ లేకపోవడం ఎంత మాత్రం కాదు. పక్క పక్కన పేర్చితే వ్యాసమయ్యే వాక్యాల సముహాన్ని,ఒకదాని కింద ఒకటి రాసి దాన్ని కవిత్వమనడం మహాపరాధం. చక్కని రూపం,లయ మంచి కవితకు కావాల్సిన ముఖ్యమైన దినుసులు.
అయిదవది:వస్తువు
తీసుకున్న వస్తువు కవి మనసుకు బాగా దగ్గరదై ఉండాలి.ఎంత చిన్న విషయమైనా కవిత్వం కావచ్చు.నిత్య జీవితంలో జరిగే ఏ చిన్న సంఘటననుంచైనా కవిత్వం పుట్టవచ్చు.నిర్జీవ వస్తువులు కూడా కవితావస్తువులు కావచ్చు.
చివరగా,కవి ఏకాంతంలో తన కవిత్వాన్ని మెరుగులు దిద్దుకోవడం తాను పూర్తిగా సంతృప్తి చెందాకే పాఠకుల ముందు ఉంచడం చేస్తే తెలుగు పాఠకులకి పుంఖాలు పుంఖాలుగా వెలువడున్న కవితాసంకలనాల సముద్రాల్లో కొట్టుమిట్టాడే బాధ తప్పుతుంది.
Some detailed thoughts