మేమింతే చీకటి తోకకు నిప్పుపెట్టే హనుమంతుడి కోసం కలలుగంటాం.
మేమింతే ఫలితపు దిశ అనిపిస్తే పక్కాగా అటువైపుగా ఒక్కటన్నా అడుగువేస్తాం.
మేమింతే … మేమింతే… మేమింతే… మేమంతా ఇంతే. ఇంతింతే.
from Blogger http://bit.ly/2fhlJ5q
via IFTTT
from Blogger http://bit.ly/2fhlJ5q
via IFTTT
మొహర్రం పండుగలో ముఖ్యంగా మసీదుల ఎదుట అలాయి తవ్వుతారు. దానిలో అగ్నిగుండాన్ని రాజేసీ దాని చుట్టూ ప్రజలు, పీర్లు ఎత్తువారు, యువకులు అసోయి-దూలా ఆరతి- కాళ్ల గజ్జెల గమ్మతి, దూలదూలరే ఖాసీమా, దుమ్ము లేసరా ఖాసీమా, వివిధ పాటలతో నృతాలు
ధన్యవాదాలు : ఈ సమాచారం అంతర్జాలంలోనూ, పత్రికలలోనూ ప్రచురితమైన వేర్వేరు ప్రదేశాలనుంచీ సేకరించినదే. మొత్తంగా ఒక క్రమంలో పెట్టడం మాత్రమే నేను చేసిన పని ఆయా సోర్సులకు ప్రత్యేక ధన్యవాదాలు
from Blogger http://bit.ly/2dKIfly
via IFTTT
SUBJECT
|
CLICK DOWN
|
TELUGU 1st LANGUAGE
|
|
TELUGU 2nd LANGUAGE
|
|
HINDI
|
|
ENGLISH
|
|
MATHEMATICS T.M
|
|
MATHEMATICS E.M
|
|
PHYSICS E.M
|
|
CHEMISTRY E.M
|
|
BIOLOGY E.M
|
|
SOCIAL E.M
|
from Blogger http://bit.ly/1edM4He
via IFTTT
అదొక పట్టణం… దానికో ప్రత్యేకత ఉంది… అది ప్రపంచంలో ఏ పట్టణానికీ లేదు! ఏమిటా ప్రత్యేకత? ఆ పట్టణం ఉన్నది నేలపై కాదు… భూగర్భంలో!ఏ పట్టణానికి వెళ్లాలన్నా బస్సులోనో, రైళ్లోనో, విమానంలోనో వెళతాం. కానీ ఆ పట్టణానికి మాత్రం భూమి కిందకి వెళ్లాలి. ఎందుకంటే అది ఉన్నది భూమి కింద! ప్రపంచంలోనే భూగర్భంలో ఏర్పడిన ఏకైక పట్టణంగా పేరుతెచ్చుకున్న దాని పేరు ‘కూబర్ పెడీ’. దీన్ని చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాలి.ఈ నేలకింది పట్టణంలో ఇప్పుడు ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు అన్నీ ఉన్నాయి. సుమారు 3000 మంది ఇక్కడ ఉంటున్నారు. రోడ్లు, ప్రార్థనాలయాలు, పాఠశాలలు, ఈతకొలనులు, గ్రంథాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలో అడిలైడ్కి దగ్గర్లో ఎడారి నేలల కింద ఏర్పడిన ఈ పట్టణాన్ని చూడ్డానికి దేశదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. కూబర్ పెడీ నగరం దక్షిణ ఆస్ట్రేలియా లోని నగరం. యిది స్టువర్ట్ హైవే లో గల అడిలైట్ నుండి ఉత్తరoగా 846 కి.మీ ల దూరంలో గల నగరం. 2011 జనాభా ప్రకారం ఈ నగర జనాభా 1,695 (953 పురుషులు,742 స్త్రీలు మరియు 275 ఇండిజెనస్ ఆస్ట్రేలియన్లతో కలిపి) .
కూబర్ పెడీ నగరం దక్షిణ ఆస్ట్రేలియా లోని నగరం. యిది స్టువర్ట్ హైవే లో గల అడిలైట్ నుండి ఉత్తరగా 846 కి.మీ ల దూరంలో గల నగరం. 2011 జనాభా ప్రకారం ఈ నగర జనాభా 1,695 (953 పురుషులు,742 స్త్రీలు మరియు 275 ఇండిజెనస్ ఆస్ట్రేలియన్లతో కలిపి) ఈ నగరాన్ని ప్రపంచ స్ఫటిక రాజధాని గా పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో విలువైన స్ఫటికాల గనులు ఎక్కువగా ఉన్నాయి.
ఎక్కువగా ఉన్నాయి.ఈ నగరం “నేల క్రింది నగరం” గా కూడా పిలువబడుతుంది. ఈ నగరాన్ని నేలక్రింద నిర్మించారు. దీనికి కారణం దహించే పగటి ఉష్ణం నుండి రక్షించుకొనుటకు కొరకు.కూబర్ పెడీ అనే పదం ‘కుప-పిటి’ అనే మాట నుంచి వచ్చింది. అంటే ‘వైట్మ్యాన్స్ హోల్’, ‘వాటర్ హోల్’ అనే అర్థాలున్నాయి. 1915లో విల్లీ హషిన్సన్ అనే వ్యక్తి… అక్కడ ఒపెల్ అనే విలువైన రాళ్లు అధికంగా ఉన్నట్లు గుర్తించాడు. తర్వాత ఆ విషయంపై పలు పరిశోధనలు జరిగాయి. విల్లీ చెప్పినట్లుగా అక్కడ ఒపెల్ గనులు ఉన్నట్లు నిర్ధారణయ్యింది. కూబర్
పెడీ లో విలువైన రాళ్ళను మొదట 1, 1915 న కనుగొన్నారు. అప్పటి నుండి ఈ నగరం ప్రపంచానికి విలువైన వజ్రాల నాణ్యత గల రాళ్ళను అందుస్తుంది.దాంతో 1916 నుంచీ ఒపెల్ తవ్వకాలు మొదలయ్యాయి. 1999 నాటికి ఆ ప్రదేశమంతా డ్రిల్ చేసి, ఒపెల్ రాళ్లను తవ్వేశారు. దాంతో గనులు తరిగిపోయాయి. దాదాపు పదిహేను మీటర్ల లోతు గల పెద్ద పెద్ద గోతులు మిగిలాయి. ఇవే తర్వాతి కాలంలో నివాస స్థలాలుగా మారాయి.
దాంతో 1916 నుంచీ ఒపెల్ తవ్వకాలు మొదలయ్యాయి. 1999 నాటికి ఆ ప్రదేశమంతా డ్రిల్ చేసి, ఒపెల్ రాళ్లను తవ్వేశారు. దాంతో గనులు తరిగిపోయాయి. దాదాపు పదిహేను మీటర్ల లోతు గల పెద్ద పెద్ద గోతులు మిగిలాయి. ఇవే తర్వాతి కాలంలో నివాస స్థలాలుగా మారాయి. జనాభా: ప్రస్తుతం కూబర్ పెడీ జనాభా సుమారు రెండు వేలు. వీరిలో తొంభై శాతం మంది భూగర్భ గృహాల్లోనే నివసిస్తున్నారు. ఈ గృహాలను వాళ్లు డగౌట్స్ అని పిలుచుకుంటారు. అలా నివసించడం ఇష్టంలేని వాళ్లు కాస్త దూరంగా నేలమీద గృహాలు నిర్మించు కున్నారు. భూగర్భంలో ఇళ్లంటే ఏదో ఓ మాదిరిగా ఉంటాయనుకోవద్దు. చాలా ఆధునికంగా, విలాసవంతంగా ఉంటాయి. ప్రతి ఇంటికీ మూడు పడక గదులతో పాటు వంటగది, బాత్రూమ్, లాంజ్ ఉంటాయి.
నేల నుండి గుంతల్లోనికి దిగడానికి మెట్లలా ఉంటాయి. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లడానికి విశాలమైన సందులు ఉంటాయి. భూగర్భంలోనే వారికోసం ఓ చర్చ్, హోటల్, బుక్స్టాల్ కూడా ఉన్నాయి. ప్రతి ఇంటికీ కరెంటు ఉంది. టీవీలు, రేడియోలు వంటివిఉన్నాయి. చాలా చల్లగా ఉంటుందికాబట్టిఏసీలతోపనిలేదు.
ఈ మధ్యనేప్రభుత్వం వీరికికేబుల్, ఫోన్కనెక్షన్లు కూడా ఏర్పాటుచేసింది. వారానికోసారిపక్కనున్నపట్టణాల నుంచి కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం వంటివన్నీ వస్తాయి. ఆ రోజే అందరూ బయటికి వచ్చి వారానికి కావలసినవన్నీ తీసుకెళ్తూ ఉంటారు. హోటల్ ఎలాగూ ఉండనే ఉంది. మొత్తంగా వాళ్లకు ఏ లోటూ లేదనే చెప్పాలి. ‘‘మితిమీరిన ఉష్ణోగ్రత కారణంగా మేమీ ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల మాకు ఏ ఇబ్బందీ లేదు. ఎలాంటి నష్టమూ లేదు. పైగా కాలుష్యం కూడా ఉండదు’’ అంటూ ఆనందంగా చెబుతున్నారు నివాసితులు. కాకపోతే భూగర్భ గృహాలు కాబట్టి వీరు కాస్త జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఇంట్లో అగ్నిప్రమాదం లాంటిది సంభవిస్తే మిగిలిన ఇళ్లు కూడా త్వరగా ప్రభావితమవుతాయి. అంతేకాక,చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ పారేయ కూడదు. ఒక్కసారి పురుగూ పుట్రా వచ్చా యంటే, వాటిని వదిలించుకోవడం అంత తేలిక కాదు. అందుకే చెత్తను మురిగి పోనివ్వకుండా నేలమీదికి వచ్చి, ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే పారబోస్తారు.
వేడిని తాళలేక వెతుక్కున్నఈ ప్రత్యామ్నాయ జీవనవిధానం ఎందరినో ఆశ్చర్యపరిచింది. మరెందరినో ఆకర్షించింది. 2006లో వచ్చిన ఒపల్ డ్రీమ్ చిత్రాన్ని ఇక్కడే తీశారు. అప్పట్నుంచీ ఇది మరింత పాపులర్ అయిపోయింది. ఓ వైవిధ్యభరిత జీవనశైలికి ఊపిరి పోసిన కూబర్ పెడీ… ఏడాది పొడవునా వచ్చే సందర్శకులతో సందడి సందడిగా మారిపోయింది.
మరింత సమాచారం కోసం
from Blogger http://bit.ly/1kjqHvA
via IFTTT
మన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’. తెలుగు నాట టాకీ వేళ్లూనుకోవడానికి ఈ సినిమానే శ్రీకారం చుట్టింది. అందుకే ఈ చిత్రం విడుదలైన రోజుని తెలుగు సినీ ప్రియులందరూ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. నిన్న మొన్నటివరకూ ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ 15న విడుదలైందనే అనుకున్నారు. అయితే సీనియర్ పాత్రికేయుడు రెంటాల జయదేవ నాలుగేళ్లు శ్రమించి, ఎంతగానో పరిశోధించి విడుదల తేదీపై వాస్తవ చరిత్రను వెలికి తీశారు. ఆయన పరిశోధన ప్రకారం తెలుగు సినిమా అసలు సిసలు పుట్టినరోజు 1932 ఫిబ్రవరి 6. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సంపాదించారు. మొత్తం 9,762 అడుగుల నిడివి గల పది రీళ్ల ‘భక్తప్రహ్లాద’ చిత్రం 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది.ఆ సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్-11032. ‘తొలి 100% తెలుగు టాకీ’గా సగర్వంగా ప్రకటించుకున్న ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్లో తొలుత విడుదలైంది. ఆ లెక్క ప్రకారం ఈ సినిమాకు నేటికి 82 ఏళ్లు నిండాయి. అప్పటి వరకూ సినిమా అంటే బొమ్మలు కదులుతాయి కానీ మాటలేమీ వినబడని స్థితినుంచి హిందిలో తొలి టాకీ అర్దేషిర్ ఇరానీ ‘‘అలం ఆరా’’ తర్వాత తెలుగులో దీన్ని నిర్మించారు. Continue reading
హాస్యాన్ని ఉత్ప్రిరితం చేసేందుకు :: ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, అసంబద్ధత (ఫార్స్), , సందర్భం మార్పు (reframing),సమయస్ఫూర్తి, శ్లేష, లాంటి వాటిని రాజకీయకోణంలోనూ సామాజిక స్థితిగతులలోనూ, పారడికల్ సిట్యుయేషన్స్ గా మలచటం ద్వారా ఇలా ఎన్నో పద్దతుల హాస్యాన్ని పుట్టించ వచ్చనేది ఇప్పటికే సిద్దాంతీకరించి వున్నా ఎవ్వడూ పట్టించుకునేలా లేరు నిజానికి ఇదో విషాద హాస్యం
హాస్యానికి అసంబద్ధత (Incongruity Theory) కారణం అని కాంట్ అంటే, ఒక నిశ్చితమైన ఫలితం లేని పరిస్థితి హాస్యం అవుతుందని హెన్రీ బెర్గ్సన్ మరింత విపులీకరించాడు. మోరియల్ అనే విశ్లేషకుడు “ఏకకాలపు కలగాపులగం” (simultaneous juxtapositions) అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చాడు. లాట్టా (Latta) అనే శాస్త్రజ్ఞుడు మాత్రం ఒక పరిస్థితిలో ఒక పజిల్కు సమాధానం లభించినపుడు కలిగే దృక్పథపు మార్పు హాస్యానికి ప్రధానమైన అంశం అన్నాడు. ఇంకా ఇలాంటి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.
ఎలాగూ నవ్వించే విధి నిర్వహించటం వల్ల నాలుగు ముద్దలు నోట్లోకి వెడుతున్నాయి కాబట్టి, కనీసం దానికి గౌరవం ఇచ్చేందుకైనా కొంచెం అధ్యయనం చేయటం పాపమా? నేరమా ?
ఈ మధ్య కామెడీ అంటే మగవాళ్ళకి చీరకట్టెసి,గొంతు కీచు పెట్టి తన్నటమో తన్నించుకోవటమో చేస్తే చాలనే ఫార్ములాని వెగటు మితిమీరి విసుగొచ్చిన దాకా వాడుతున్నారు. పైగా అదే ఆడియో రిలీజుల్లో కూడా. చీర బ్యాచ్ ల పేరుతో కొందరు ట్రేడ్ మార్క్ చేసేసుకున్నారు.
ఫేస్ బుక్ వాల్ పై జరుగుతున్న చర్చలో కుదిరితే మీరు పాలుపంచుకోండి.
ఏమో ఈ నిరసన ఒక్క కార్యక్రమంలో మార్పుకు కారణమయినా మంచిదే కదా?
(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));
జంబుద్వీపం:
సంకల్ప మంత్రంలో భాగంగా వచ్చే పదాలు “జంబుద్వీపే భరతవర్షే భరతఖండే” అనేవి మనమందరం వినే ఉంటాము.
అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?
జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
1) కేతుముల వర్ష
2) హరి వర్ష
3) ఇలవ్రిత వర్ష
4) కురు వర్ష
5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష
7) కింపురుష వర్ష
8 ) భద్రస్వ వర్ష
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) . పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనే ఆధారాలుగా వీటిని పేర్కొంటూ ఉన్నారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదనేది ఒక వాదన.
అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవట.
( సోషల్ నెట్ లో ప్రచారంలో వున్న ఈ వ్యాసంలోని సారాంశ రూపాన్ని మాత్రం సమాచారం గా తీసుకున్నాను. శాస్త్రీయ ఆధారాలు ఏమున్నాయనేది దీనికి అనుభంధంగా లభించలేదు. అటువంటివి దొరికితే ఇక్కడే పోస్టు చేస్తాను. మీకు తెలిసి వుంటే కామెంటుగా పోస్టు చేయండి )
ఈ మధ్య శాస్త్ర వేత్తలకు దేవుడు కూడా కొంచెం కొంచెంగా దర్శన భాగ్యం కల్పించేస్తున్నట్లున్నాడు. ఈమధ్యనే అమెరికా స్పేస్ ఏజన్సీకి స్పష్టంగా దేవుడి బ్రహ్మాండమైన చేయి దర్శన భాగ్యం కలిగిస్తే, గత సంవత్సరం ఏకంగా యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి దైవ నేత్రమే కనిపించింది. ఇందులో మనమేమన్నా తక్కువ తిన్నామా బోసు గారి పుణ్యామా అని ఆయన కనుక్కున థీరీ ప్రకారం దైవకణం ఆచూకీనే పట్టేస్తున్నాం. వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇవ్వన్నీ నిజమే నండోయ్. ఇంకా డౌటుంటే కొ్ని వివరాలు చదివేయండి.
జూన్ 2012 లో నాసా ప్రయోగించిన న్యూస్టార్ అనే రోదసీ నౌక అస్తమిస్తున్న నక్షత్రాన్ని ఫొటో తీసి భూమ్మీది శాస్త్రజ్ఞులకు పంపించింది. అది ఒక హస్తం ఆకారంలో రంగులీనివుండటంతో దాన్ని దైవహస్తం (హాండ్ ఆఫ్ గాడ్) అని అభివర్ణించారు.
న్యూస్టార్ ని నక్షత్రాలు, పాల పుంత, శక్తివంతమైన ఎక్స్ రే ల విషయంలో అధ్యయనం కోసం అంతరిక్షంలోకి పంపించింది అమెరికన్ నాసా సంస్థ. నశిస్తున్న నక్షత్రాలు, పాలపుంతకు కూడా ఆవల వున్న ఇతర పదార్థాలను శోధించటానికి పంపించిన ఈ రోదసీ నౌక మండిపోయి అంతరిస్తున్న నక్షత్రాన్ని ఫొటో తీయగా అది రంగులు చిమ్ముతూ ఒక చేతి ఆకారంలో కనిపించింది.
నశిస్తూ విచ్ఛిన్నమవుతున్న ఈ నక్షత్రం (పల్సర్) ఇంకా గిరగిరా తిరుగుతూనేవుంది. ప్రస్తుతం కేవలం 19 కి.మీ ల వ్యాసంలో మిగిలివున్న ఈ పల్సర్ సెకండ్ కి ఏడు సార్లు తనచుట్టూ తాను తిరుగుతోంది. దీనినుంచి విడిపోయిన ముక్కలు ఎక్స్ రే లతో సంయోగం చెంది మండుతున్నాయి.
చేతి ఆకారంలో కనిపిస్తున్న మండుతున్న పదార్ధపు భాగాలు ఒకదానితో ఒకటి ఒక ప్రత్యేకమైన రీతిలో కలుస్తుండటం వలన అలాంటి ఆకారంలో కనిపిస్తోందా లేకపోతే అవి ఉండటమే ఆ ఆకారంలో ఉన్నాయా అన్నది ఇంకా శోధించవలసివుంది.
గత ఏడాది యూరోపియన్ స్పేస్ ఏజన్సీ కూడా దేవుడి కన్ను అంటూ ఓ ఫొటోను విడుదల చేసింది.
లార్జ్ హాడ్రన్ కొల్లాయిడల్ (LHC) ప్రయోగం ద్వారా పదార్ధానికి మూలమైన అత్యంత మూలకణాన్ని థిరిటికల్ గా ఊహించి దానికి గాడ్ పార్టికల్ అని పేరు పెట్టారు.
మరి శాస్త్రవేత్తలు ఈ పేర్లు పెట్టడం వెనక కారణంగా కనిపిస్తున్న దేవుడు ఎవరో మాత్రం అర్ధం కావటం లేదు. జనాలకర్ధం కావటం కోస పెడుతున్న సినిమా పేర్లలాగా ఈ వరస ఎక్కడిదాకా వెళుతుందో. దేవుడా….
ప్రవహిస్తున్న ముచుకుందా నది |
మూసీకున్న అసలు పేరు సంగతి అలా వదిలేయండి. ఇప్పటి తరానికి మూసీ అంటే ముక్కుమూసుకునేంత దుర్ఘంద భరిత మురికి కాలువ అనే తెలుసు. నిజానికి అదో స్వచ్ఛమైన నది, మన అత్యాసలే కలుషితాలై దాన్నలా దుర్వాసనలతో కుమిలిపోయేలా చేసాయని ఎలా తెలుస్తుంది. అదొక స్వచ్చమైన గలగల పారే నదిలా వుండేదని ఎన్నటికి తెలుస్తుంది?
1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ప్రతిరోజూ జంటనగరాల నుండి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు మరియు పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. కానీ దీనికి కేవలం 20% నీటినే పరిశుద్ధ పరచగల సామర్ధ్యం ఉన్నది. 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించారు. కానీ, మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు మరియు రాజకీయ ప్రతిపక్షాలు మరియు వామపక్షాల వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు. ఈ మురికివాడల్లో 20 వేల మంది పైగా ప్రజలు ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా.
హరిచ్చద్రుడూ, దిలీపుడూ, రఘు, శ్రీరాముడు వంటివారు జన్మించిన ఇక్ష్వాకుల వంశం లేదా రఘు వంశంలో జన్మించిన మాంధాత మహారాజ పుత్రుడు ముచుకుందుడు. ఒకనొక సందర్భంలో దేవతల తరపున రాక్షసులకు వ్యతిరేఖంగా జరిగిన ఘోర యుద్దంలో పాల్గొని శత్రువులను ఓడిస్తాడు. కానీ ఆ యుద్దంలో చాలా అలసి పోవటం వలన మంచి విశ్రాంతి కావలనుకుంటాడు. తన అలసట తీర్చుకోవడానికి అనంతగిరి కొండల్లో నిద్రిస్తాడు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు తపస్సు చేయాలనుకున్న మార్కండేయ మహర్షి అందుకు అనువైన స్థలాన్ని తనకు సూచించాలని బ్రహ్మ దేవుడిని కోరగా, ముచుకుందుడు నిద్రిస్తున్న అనంతగిరి కొండలే నీకు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశమని బ్రహ్మదేవుడు మార్కండేయునికి సూచిస్తాడు. బ్రహ్మ దేవుడు సూచించిన ప్రకారం మార్కండేయుడు అనంతగిరి కొండల్లో కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు ఆచరిస్తాడు. ఈ సమయంలోనే శ్రీ కృష్ణుడు,
బలరాముడిపై కాలయవనుడు అనే రాక్షసుడు దండెత్తి రావడంతో ఆయన ధాటికి తట్టుకోలేక శ్రీకృష్ణ, బలరాములు అనంతగిరి అడవుల వైపు పరుగెత్తి వచ్చి అదృశ్యమవుతారు. వారిని వెంబడిస్తూ అనంతగిరి అడవులకు వచ్చిన కాలయవనుడు అక్కడ తపస్సులో ఉన్న మార్కండే యుడిని చూసి శ్రీకృష్ణ, బలరాముల జాడ సూచించాలని కోరగా మార్కండేయుడు ముచుకుందుడు నిద్రిస్తున్న గుహను చూపిస్తూ ఆవైపు వెళ్లమని సైగ చేస్తాడు. కాలయవనుడు ఆగ్రహంతో భీకరంగా అరుస్తూ గుహలోకి ప్రవేశిస్తాడు. . కాలయవనుడి భీకరమైన అరుపులకు నిద్రాభంగమైన ముచుకుందుడు ఆగ్రహంతో కళ్లు తెరువగా, ఆ కళ్ల నుంచి వెలువడిన కాలాగ్ని జ్వాలకు కాలయవనుడు అక్కడిక్కడే భస్మమై పోతాడు. అంతకు ముందే అతడికి దేవతలు ముచుకుందుడికి నిద్రాభంగం కలిగించిన వారు భస్మమయ్యేలా వరాన్ని ప్రసాదిస్తారు. ముచుకుందుని కోపాన్ని శాంతింప చేయడానికి శ్రీ కృష్ణుడు అనంత స్వరూపుడై శ్రీమన్నారాయణుడి(అనంత పద్మనాభస్వామి)రూపంలో దర్శనమిస్తాడు. శ్రీ కృష్ణుడిని అనంత స్వరూపంలో చూసి ప్రసన్నుడైన ముచుకుందుడు వెంటనే తన కమండలంలోని పంచతీర్థంతో శ్రీమన్నారాయణుడి పాదాలను అభిషేకిస్తాడు. స్వామివారి పాదాలను అభిషేకించిన పంచతీర్థం ద్వారా ఉద్భవించిందే ముచుకుందా నది. ఈ నదిలో స్నానమాచరించిన వారి కోరికలు నెరవేరుతాయని శ్రీమన్నారాయణుడు అభయమిస్తాడు. నాటి ముచుకుందా నదే కాలక్రమేణ మూసీనదిగా పిలువబడుతోంది. ముచుకుందునికి శ్రీకృష్ణ భగవానుడు అనంతపద్మస్వామి అవతారంలో దర్శనమిచ్చిన కారణంగానే అనంతగిరిలో వెలసిన స్వామికి అనంత పద్మనాభ స్వామిగా పేరు వచ్చిందని పురాణ కథనాలు చెబుతున్నాయి
మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నప్పటికీ పురానా పూల్ (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీలు 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ వంతెన వాడుకలో ఉంది. నయా పూల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉన్నది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్పూరా, చాదర్ఘాట్, అంబర్పేట, నాగోల్ మరియు ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నవి. విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి 7, వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర మరియు దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.
Some detailed thoughts